Posts

Showing posts from October 20, 2023

మన్యం కాఫీకి ప్రపంచ గుర్తింపు : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర - డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన

Image
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డౌనూరులో జిసిసి కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి రాజన్నదొర ,  చిత్రంలో సుబ్బారెడ్డి ,  మాధవి ,  ఫాల్గుణ ,  భాగ్యలక్ష్మి ,  రవిబాబు, జిసిసి ఎండి సురేష్ కుమార్, ఐటిడిఎ పి.ఓ. అబిషేక్ తదితరులు   అల్లూరి జిల్లా ఏజెన్సీ లో సేంద్రీయ విధానంలో గిరిజనులు  సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు ,  డిమాండ్ వున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వేడిక రాజన్నదొర చెప్పారు. శుక్రవారం కొయ్యూరు  మండలంలోని డౌనూరులో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ. 4  కోట్లతో నిర్మించనున్న సమీకృత కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం జీసీసీ ఎండీ సురేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ,  కాఫీ రైతుల ను మరింత ప్రోత్సహిం చేందుకు ,  ఆధునిక పద్ధతుల్లో - నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి తీసుకురావాలని అధికారు లను ఆదేశించారు. గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి