డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన - News Coverage

 అల్లూరి జిల్లా ఏజెన్సీ లో సేంద్రీయ విధానంలో గిరిజనులు  సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపుడిమాండ్ వున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వేడిక రాజన్నదొర చెప్పారు. శుక్రవారం కొయ్యూరు  మండలంలోని డౌనూరులో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ.4 కోట్లతో నిర్మించనున్న సమీకృత కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం జీసీసీ ఎండీ సురేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూకాఫీ రైతుల ను మరింత ప్రోత్సహిం చేందుకుఆధునిక పద్ధతుల్లో - నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి తీసుకురావాలని అధికారు లను ఆదేశించారు. గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందనిఇందు లో భాగంగానే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతులు తాము పండించిన కాఫీ పంటను దళారులకు కాకుండా జిసిసికి విక్రయిం చాలనితద్వారా రైతులకు అధిక ధర లభిస్తుందనిఇదే సమయంలో సంస్థ ఆదాయం పెరుగుతుందని అన్నారు. కాఫీ పల్చింగ్ యూనిట్లు కోసం రైతులకు రుణ సదుపాయం కల్పించాలని జీసీసీ ఎండీకి సూచించారు. జీసీసీ ప్రస్తుతం రూ.500 కోట్లు లావాదేవీలు నిర్వహిస్తున్నదని, ఈ ఏడాది నుంచి పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో రెండున్నర లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు వున్నాయని మరో లక్ష ఎకరాల్లో తోటలను అభివృద్ధి చేయడానికి ఐటీడీఏ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు

అరకులోయ ఎంపి జి.మాధవి మాట్లాడుతూకాపీ రైతుల కోసం తన సొంత మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ను నిర్మించడం ఎంతో ఆనందంగా  వుందన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ మాట్లాడుతూకాఫీప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయితే ఇక్కడి నుంచే కాఫీ పొడిని అంతర్జాతీయ మార్కెట్కు తరలించవచ్చని అన్నారు. జీసీసీ ఎండీ సురేశకుమార్ మాట్లాడుతూకాఫీ రైతులకు మార్కెటింగ్ సౌకర్యంతోపాటు ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మిశెట్టి ఫాల్గుణజిల్లా పరి షత్ చైర్పర్సన్ జెసుభద్రజీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతి రాణిఎమ్మెల్సీ కుంబా రవిబాబుమాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజుప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. 










Comments

Popular posts from this blog

అరకువ్యాలీ కాఫీ, జిసిసి కృషిని ప్రశంసించిన ప్రధాని మోది జి.. అరకు కాఫీ రుచిని ఆస్వాదించమని మన్ కి బాత్ శ్రోతలను కోరిన ప్రధాని

🌿 Embrace the goodness of Turmeric from the heartlands of Andhra Pradesh! 🌿

GCC VC & MD G.Suresh Kumar Visits VDVKs in Seethampeta